• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు -2 : -ముహమ్మద్.యం.ఎ.అభిలాష్

హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు -2 : -ముహమ్మద్.యం.ఎ.అభిలాష్

వేదం ప్రకారమే వర్ణ విభజన ఉంది కదా!
తనకు చెందినదైతే లోపం ఉన్నప్పటికీ సమర్ధించటం. తనకు చెందనిదైతే లోపం లేక పోయినా విమర్శించటం అన్న దుర్మార్గత లేనితనాన్నే న్యాయ దృష్టి అని అంటారు. తన-పర భేదం లేకుండా కేవలం సత్యా- అసత్యాలనే చూడగలగాలి. అప్పుడు మాత్రమే యధార్ధకు చేరుకోగలము. ఈ విషయన్ని దృష్టియందు ఉంచుకుని ముందుకు సాగాలని నా మనవి.
        వేదం అంటే విద్య లేక జ్ఞానము. ముఖ్యంగా- మానవుడు తన జన్మను ఇహలోకంలో విజయవంతంగా గడిపి, పరలోకంలో ముక్తిని సాధించే విద్య. దానితో పాటు ఇతర విద్యలూ అందులో ఉన్నాయి. మనిషి సక్రమ మనుగడకు సామాజిక వ్యవస్థ తప్పనిసరి. ఆ వ్యవస్థ ఏర్పడాలంటే దానిలో అంతస్థులు ఉండటం అనివార్యం. ఏ అంతస్థుకు తగిన వ్యక్తులు ఆ అంతస్థులో సమకూరినప్పుడే వ్యవస్థ గమనం ముందుకు సాగుతుంది. లేని యెడల వ్యవస్థ స్థంబించిపోతుంది. అంతటి అనివార్యమైన ఆయా అంతస్థులకు చెందవలసిన వివిధ తరగతుల వ్యక్తులను గురించి ఈ క్రింది మంత్రంలో సర్వేశ్వరుడు తెలియజేస్తున్నాడు. కాస్త ప్రశాంతంగా గమనించగలరు.
            బ్రాహ్మణలు శిరస్సునుండి, క్షత్రియులు భుజములు నుండి వైశ్యులు తొడల 
           నుండి మరియు శూద్రులు పాదముల నుండి జన్మించిరి. -ఋగ్వేదం 10:90
         ఒక విజయవంతమైన సంఘానికి కావలసిన నిర్మాణ క్రమాన్ని చూపించటం పై మంత్రపు అసలు లక్ష్యం అన్నది ముందుగా గమనించాలి. అందుకే అందులో ఒక అద్భుతమైన "వర్ణన" ఉంది. మరొక అత్యవసరమైన "క్రమము" ఉంది.
        ముందు "వర్ణన"ను గురించి గమనించినట్లయితే- ఒక ఆరోగ్యకరమైన "శరీరము" ఒక ఆరోగ్యకరమైన "సంఘము"నకు గొప్ప సాదృస్యం!
        ఇక అత్యవసరమైన "క్రమము" విషయానికి వస్తే, శిరస్సు-భుజములు-తొడలు-పాదములు శరీరమునకు ప్రముఖ విభాగములు. అవి తమ,తమ స్థానాలలో "క్రమబద్ధం"గా ఉండి, పరస్పరం "సమన్వయం"తో పని చేయాలి. ముఖ్యంగా శిరస్సు లేక మేధస్సు నుండి వచ్చే ఆదేశాలను మాత్రమే మిగతా మూడు విభాగాలూ పాటించాలి. వేటికవి సర్వ స్వతంత్రంగా పని చేయకూడదు.అప్పుడు మాత్రమే ఒక శరీరం ద్వారా విజయవంతమైన గొప్ప కార్యాలు సంభవిస్తాయి.
        అచ్చం అలాగే ఒక సమాజంలోని సకల సామాన్య వర్గాల వారూ ధర్మ నిష్ఠా పరాయణలైన ఉత్తముల ఆదేశాల మేరకు మాత్రమే తమ కార్యాకలాపాలను నిర్వర్తిస్తే, అటువంటి సమాజం ద్వారానూ విజయవంతమైన గొప్ప కార్యాలు సంభవిస్తాయి. తద్వారా అందరూ సుభిక్షంగానూ, ఆనందంగానూ ఉండవచ్చును. ఈ వాస్తవాన్ని విశదీకరించటానికే పై అభివర్ణన చేయబడింది.
        ఈ "అంతర్యము"ను గుర్తించక మంత్రాన్ని "అక్షరార్ధము"లో తీసుకుని విమర్శించటం ఎంతవరకు సమంజసం? ధర్మ శాస్త్రాల ప్రబోధనల "అంతర్యము"ను కాక, "అక్ష్రార్ధము"ను తీసుకుని వ్యాఖ్యానిస్తే హిందూ శాస్త్రులలోని ప్రబోధనలే కాదు. బైబిల్, ఖురాను తదితర థర్మ శాస్త్రాల ప్రబోధనలూ హాస్యాస్పదంగానే కనిపిస్తాయి.
        అలాగే ఎందరో వంచకులు, స్వార్ధపరులైన శాస్త్రులు చేస్తున్న "తప్పుడు వాఖ్యానము"లను ధర్మ శాస్త్ర ప్రబోధనలు" అని భ్రమించే వారికి లేక కేవలం గుడ్డిగా విమర్శించటమే అభ్యుదయవాదమని భావించే వారికి పై మంత్రంలోని వర్ణన హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. ( Next Page)

1 Response to "హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు -2 : -ముహమ్మద్.యం.ఎ.అభిలాష్"

  1. Chiru Dreams

    అతుకులతెలివితేటలు అని మీ గురించి హరిబాబుగారు అంటే ఏంటో అనుకున్నా.. నిజమే సుమీ....

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine