• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!

విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!

Label: ARTICLES

ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం కూడా. అందుకే ఆదినుండి ఏకేశ్వరవాదం పవిత్రమైనదిగా, వికాశవంతమైనదిగా మరియు బహుదైవవాదం అనగా విగ్రహారాధన అపవిత్రమైనదిగా, వినాశవంతమైనదిగా సకల థర్మశాస్త్రాలూ ఘోషిస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అనేకమంది హిందూ వేదవేత్తలు హిందూజాతిని ఎప్పటికప్పుడు విగ్రహారాధన విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాంటి మహనీయులలో - ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి ఒకరు. ఈయన విగ్రహారాధన వలన మానవుడు మోక్షాన్ని వ్యర్ధం చేసుకుంటాడని ఇంకా అనేక నష్టాలు చవిచూస్తారని హెచ్చరించారు.
                 విగ్రహ పూజయే థర్మార్ధ కామ మోక్షములకు సాధనమని అనుకొని 
                 పురుషార్ధమును సాధించక మనుష్యజన్మమును వ్యర్ధం చేసుకొందురు.
    సృష్టికర్త మహోన్నతుడు,సర్వమూ తెలుసుకొనేవాడు, యావత్తు సృష్టి ఆయన ఆదీనంలో నడుస్తోంది. అటువంటి శక్తిసంపన్నుడను ఏరాతి రూపంలో బంధించగలము. అది దైవాన్ని అవమానించుట కాదా? అని దయానందుడే హెచ్చరించేవాడు.
               "ఎవడైన ఒకడు మీరు కూర్చుండే సింహాసనం మీదకాని మీ పేరు మీదకాని 
                ఒకరాయిని ఉంచుతానని అంటే మీరు కోపోద్రేకులై అతనిని కొట్టుటకు 
                సిద్ధపడతారు. లేదా తిట్టటమైన చేస్తారు. అలానే పరమేశ్వరుని ఉపాసించే 
               (వేడుకునే) స్థానమైన హృదయం మీదనో పేరు మీదనో పాషాణాది విగ్రహాలను 
               ఉంచితే పరమేశ్వరుడు ఆ దుష్టబుద్ధి కలవారిని ఎందుకు నాశనం చేయడు?"
   ఈ విధంగా స్వామి దయానందుడు విగ్రహారాధన వ్యక్తి పతనానికి దారి తీస్తుందని, దాని వలన విగ్రహారాధికులు మోక్షసిద్దులను కోల్పోతాడని తీవ్రంగా హెచ్చరించియున్నారు.

31 Responses to "విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!"

  1. Jai Gottimukkala

    విగ్రహారాధన *వల్ల* మోక్షం దిద్దించదు అనడం విగ్రహారాధన *చేసే వారికి* మోక్షం దిద్దించదు అనడం ఒకటేనా?

    మోక్షమంటే ఏమిటి?

    ఆర్య సమాజ్ నమ్మకం ప్రకారం సత్కర్మలు చేసిన వారికి పునర్జన్మ పరంపర నుండి విముక్తి లభిస్తుంది. దీన్ని మీరు ఒప్పుకుంటారా?

    ఒకవేళ ఒప్పుకుంటే "తీర్పు దినం" సిద్దాంతాన్ని వదిలేసుకోవడానికి సిద్దమా? ఒకవేళ ఒప్పుకోకపొతే దయానందుని బోధనలను మీరు తిరస్కరించినట్టు కాదా?

    1. Unknown

      జైగారు…విగ్రహం పెట్టి పూజించేవారిని విగ్రహారాధికులంటారు. ఆ విధానాన్ని విగ్రహారాధనంటారు. రెండూ ఒక్కటే! దీని వలన మోక్షం సిద్ధించదని స్వామి దయానంద సరస్వతి పేర్కొన్నారు.
      ఇక మోక్షమన్న పదానికి అర్ధం శాశ్వత లోకం (స్వర్గం) పొందడమని అర్ధం. వేదంలోకాని, భగవద్గీతలోగాని పరిశీలిస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. మీ క్రైస్తవ పరిభాషలో పరలోకం లేక నిత్యజీవం అని అర్ధం.
      పునర్జన్మ ఉంది. నేటి హిందువుల భావన ప్రకారం ఈ ఇహలోకంలో మాటి,మాటికి పుట్టడం చనిపోవడం కాదు. పునర్జన్మ అంటే తిరిగి పుట్టడం. అంటే చేసుకున్న కర్మలను బట్టి స్వర్గమైనా కావచ్చు.నరకమైనా కావచ్చు. ఇవి శాశ్వతలోకాలని వేదాలే ఘోషిస్తున్నాయి.
      తీర్పుదినపు ప్రస్తావన మన హిందూ శాస్త్రాలలో చాలా స్పష్టంగా ఉంది. ఏ విషయమైనా నమ్మడానికి ప్రామాణికం థార్మిక శాస్త్రాలే తప్ప పండితులు గాని, సంస్థలుగాని కాదు. విగ్రహారాధనను వేదం తీవ్రంగా ఖండిస్తోంది.దానిని దయానందులవారు ఏకీభవించారు కాబట్టి నేను సమర్ధించాను. అంతే గాని మిగతా ఆయన గారి సొంత నమ్మకాలు వేదానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఏకీభవించాల్సిన అవసరం ఉందంటారా జైగారు? స్వామి దయానందుని వారి విషయంలో ఏకేశ్వరోపాసన విషయంలో చాలా గొప్ప విషయాలు ఆయన బోధించారు. తీసుకోవడంలో తప్పేముంది. ఆ ఒక్క విషయాన్ని సమర్ధించినంత మాత్రాన మిగతా అన్ని విషయాలు ఒప్పుకున్నట్టు కాదు కదా సర్? మనం తీసుకోవల్సినవి, వదులుకోవల్సినవి కేవలం థార్మిక శాస్త్రాలకు వ్యతిరేకమైనవి, అనుకూలమైనవి మాత్రమేనని మనవి.

    2. Unknown

      మిత్రులు జైగారికి వందనాలు! సర్వసృష్టికర్త అయిన సర్వోన్నత ఏకైక దేవునికి స్వయంగా ఆయన సృష్టితాలైన; "వారిని" లేక "వాటిని" ఆయనతో సాటిగా భావించి; "వేడుకోవటమే వాస్తవానికి విరహారాధన" అవుతుంది. సకల సృష్టీ సక్రమముగా నడుస్తుందంటే- దానికి ప్రధాన కారణం- ప్రతీదీ తనతన నిర్దేశిత స్థానంలో ఉండి; నిర్దేశిత "సంబంధం" కలిగి ఉండటమే! వాటిలోని ఏ ఒక్కటి అయినా "స్థాన భ్రంశము" చెందితే సంభవించేది విలయం ప్రళయం మాత్రమే!
      అలాగే "భక్తునికి" మరియు "భగవంతునికి" మధ్య ఉండవలసిన "యథార్థ"మైన సంబంధము "ప్రత్యక్ష"మయినదేగాని "పరోక్ష"మయినది కాదు. అందుకే మన ప్రాచీన హిందూ-క్రైస్తవ-ముస్లిం ఇంకా తదితర మహనీయులందరిలో ఏ ఒక్కరూ ఎన్నడునూ "విగ్రహారాధన" అనే "పరోక్ష" దైవ సంబంధ విధానాన్ని అవలంబించలేదు. వారంతా "ప్రత్యక్ష" దైవ సంబంధ విధానాన్ని మాత్రమే అవలంబించారు. కనుక ఆ మహనీయుల వారసత్వం మనకూ చెందాలంటే మనమూ అదే చేయాలి.
      నేడు విగ్రహారాధకులు అనగానే ముస్లిములకు-క్రైస్తవులకు వెంటనే జ్ఞాపకం వచ్చేది, హిందువులే! ఇది చాల శోచనీయం. క్రైస్తవులలో 99 శాతం మరియు ముస్లిములలో 50 శాతం విగ్రహారాధకులే!! కనుక వారికీ మోక్షం ఉండదు! మరిన్ని వివరాలకు- "విగ్రహం విజ్ఞానమా?-అజ్ఞానమా?" అనే పుస్తకాన్ని చదవగలరు.
      ఇక, ఆర్యా సమాజం గురించి మీ ప్రస్తావనను బట్టి- ఒక వర్గంతో ఏకీభవించటం అనేది రెండు విధాలుగా ఉంటుంది. వాటిలో ఒకటి- "పాక్షికం"గా లేక రెండు- "సంపూర్ణం"గా. కనుక ఒకటి నమ్మితే మరొకటి వదులుకొనేది ఏమీ ఉండదు. ఆ తరువాత, తీర్పుదినం, నిత్య స్వర్గం మరియు నిత్య నరకం అన్న "సిద్ధాంతాలు" అన్ని గ్రంధాలూ ఎకగ్రీవంగా ప్రతిపాదిస్తున్నవే! సోదరులు జై గారికి ధన్యవాదాలు. ఇక శెలవు.
      http://sakshyammagazine.blogspot.in/2014/09/download.html

    3. Jai Gottimukkala

      చౌదరి గారూ, దయానందుల వారు విగ్రహారాధన వల్ల మోక్షం రాదన్నారు ఎందుకు? ఇది పనికి రాదనీ కేవలం దీని ద్వారా మోక్షం వస్తుందనే ఆలోచన తప్పని వారి ఉద్దేశ్యం. అంతే తప్ప విగ్రహారాధన పాపమనొ లేదా మూర్తి పూజ చేసేవారికి మోక్షం సిద్దించదని వారు అన్నారా? Swamyji rejected idol worship as a means to salvation but did not (unlike your co-religionists) condemn idol worshipers to eternal damnation.

      తీర్పు దినం (ఖయామా) క్రైస్తవ ఇస్లాం మతాలలో ఉంది నిజమే. దయానందుల వారు దీన్ని సమర్తించలేదు. వారి బోధనలలో మీరు ఏకీభవించిన విగ్రహారాధన వ్యతిరేకత ఎంత ముఖ్యమో పునర్జన్మ పరంపర నుండి సత్కర్మల ద్వారా విముక్తి కూడా అంతే ముఖ్యం. Both are integral parts of Arya Samaj theology and can't be separated like you are attempting.

      మీరు చేసే వాదనలకు అన్నిటికీ హిందూ ధర్మ శాస్త్రాలలో పూర్తి అంగీకారం ఉందనుకుంటే అన్నిటికీ అవే ఆధారాలు ఇవ్వండి, ఆర్య సమాజ్ ఆధారాలు ఎందుకు?

      అలాగే మీరు చెప్పే ఇస్లామిక్ సిద్దాంతాలు అన్నీ వేదాలలో ఉంటె, అందరూ సనాతన ధర్మం పాటిస్తే చాలు కదా? కొత్త విషయాలు ఏమీ లేని పరాయి దేశ గ్రంధం/మతం/ప్రవక్త అవసరమా?

      I will repeat the last para in English for better clarity. You claim every Islamic theological principle you support are already in Hindu scriptures. If this is true, why do we need a new book/religion/prophet that has zero new ideas?

    4. Unknown

      మిత్రులు జైగారికి వందనములు!
      ఇక్కడ మనమందరమూ ఉమ్మడిగా అంగీకరించవలసిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది- సిద్ధాంతం సిద్ధాంతమే! దానిని ఇస్లాం సిద్ధాంతం అని, హిందూ సిద్ధాంతం అని, క్రైస్తవ సిద్ధాంతం అని. తోకలు పెట్ట కూడదు. ఇంకా ప్రాంతీయ వేర్పాటునూ పాటించ కూడదు. ఉదాహరణకు: "ఈ మహోన్నత సృష్టికి సర్వోన్నత సృష్టికర్త ఒకే ఒక్కడు ఉన్నాడు, అతడినే వేడుకోవాలి".అన్న "సిద్ధాతము"నే తీసుకోండి. దానిని ఇస్లాం సిద్ధాంతం అని అందామా? హిందూ సిద్ధాంతం అని అందామా? క్రైస్తవ సిద్ధాంతం అని అందామా? లేక వేద సిద్ధాంతం అని అందామా? బైబిలు అని అందామా? ఖురాన్ సిద్ధాంతం అని అందామా? లేక స్వదేశీ సిద్ధాంతం అని అందామా? విదేశీ సిద్ధాంతం అని అందామా?
      రెండవది- మహనీయుల విషయానికి వస్తే, మొదటి మానవ జంట ఐన ఆదాము-హవ్వలు (హిందూ శాస్త్రాల ప్రకారం- శివ-పార్వతులు) మొదలు శ్రీ రామకృష్ణాదుల నుండి అబ్రాహాము మొదలు ఇస్సాకు, యాజోబు, నుండి మోషే యేసుల తరువాత ప్రవక్త మూకమ్మద్ వరకూ ఉన్న “సకల మహనీయులనూ సమానంగా గౌరవించాలి వారి ఆదర్శాలను అనుసరించాలి" అన్న "సిద్ధాతము"ను ఇస్లాం సిద్ధాంతం అని అందామా? హిందూ సిద్ధాంతం అని అందామా? క్రైస్తవ సిద్ధాంతం అని అందామా? లేక వేద సిద్ధాంతం అని అందామా? బైబిలు సిద్ధాంతం అని అందామా? ఖురాన్ సిద్ధాంతం అని అందామా? లేక స్వదేశీ సిద్ధాంతం అని అందామా? అందామా? విదేశీ సిద్ధాంతం అని అందామా?
      ఒకరి మహనీయులను ఒకరు మరియు ఒకరి గ్రంధాలను ఒకరు నమ్మాలని దేవుడే ఆదేశించాడు కనుక మనం నమ్మాలి! ఆ విధంగా వైవిధ్యాన్ని పాటించే వారు కేవలం "సంకుచిత వాదులు" మాత్రమే కాగలరు తప్ప "విశ్వజనీన వ్యక్తులు" కాలేరు కదా!
      కనుక మీరూ-మేమూ మన విభిన్న ధార్మిక గ్రంధాలలోని సంస్కృత, హీబ్రూ, అరబిక్ "సాంకేతిక పదము"ల సంకెళ్ళ బంధనాల నుండి బయటపడి, సృష్టికర్త ఇచ్చిన ధర్మశాస్త్రాల సువిశాల "సిద్దాంతాల" గగనంలో విహరిద్ధాం! ఇంకా అన్ని మత వర్గాల ప్రజలనూ విహరింపజేద్దాం!
      ఇక, నేను వ్యక్తపరుస్తున్న ఈ “సువిశాల భావజాలం” ఖురాన్ మరియు దానికి పూర్వపు గ్రంధాల సందేశం నుండి పరి గ్రహించినదే!
      ఖురాన్ వాదన ఏమిటంటే- “సర్వ సృష్టికర్త గతంలో మీకు ‘ఒక ప్రత్యేక జీవన దృక్పథము’ను ఇచ్చి ఉన్నాడు. దాని ఒక భాగాన్ని మీరు కొంత అతిశయమునకు గురిచేసి, వికృత పరిచారు. దాని ఒక పెద్ద భాగాన్ని దాచేశారు. దాని వాస్తవ స్వరూపము ఇదీ! అని ‘ప్రాచీన సనాతన ధర్మము’ను చూపించి, దానిని అనుసరించాలి” అన్నదే!
      అందుకే అది ముస్లిమేతరులను ఉద్దేశించి- ఖురాన్ 5:66, 68- “అయ్యో! మీరు మీ వద్ద ఉన్న ధర్మ శాస్త్రాల ‘ప్రబోధన’లను ఆచరణలో పెడితే ఎంతబాగుండేది!” అని, అలాగే “మీకు మీ ధర్మ శాస్త్రాల ‘ప్రబోధన’లను ఆచరణలో పెట్టనంతవరకూ అసలు మీరు ఈ పునాదిపైనా లేనట్లే!” అని కోరుతుంది.
      అది ముస్లిములకు చెప్పేదేమిటంటే- ఖురాన్ 3:187- “మీరు (ముస్లిములు) వారి (ముస్లిమేతరుల) వద్దకు వెళ్ళీ, దాచి పెట్టకుండా ప్రజలలో ప్రచారం చేయాలనే ‘షరతు”తో ఏ ధర్మ శాస్త్రాల ‘ప్రబోధన’లను మీ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో దానిని మీరు దాచి వేశారట! వాటి సందేశాన్ని ప్రచారంలో పెట్టండి!” అని చెప్పమంటుంది.
      కనుక తమ తమ ధర్మ శాస్త్రాల ‘ప్రబోధన’లను అనుసరిస్తే వారే ‘అరబీ భాష’ ప్రకారం- ముస్లిములు (దైవ విద్దేయులు) అవుతారు. ‘సంస్కృత భాష’ ప్రకారం- యోగులు (దేవునికి దగ్గరగా ఉన్నవారు) అవుతారు. క్రైస్తవ పరిభాష ప్రకారం- దేవుని విశ్వాసులు అవుతారు. ఈ విధంగా వారి మధ్య ‘సాంస్కృతిక పరమైన, వేష-భాషల పరమైన వైరుధ్యం’ ఉన్నప్పటికీ ‘ధార్మిక భావజాల ప్రమైన ఏకత్వం’ ఉంటుంది. ఇదే విశ్వవ్యాపిత మహత్తర సిద్దాంతం- ‘భిన్నత్వంలో ఏకత్వం’ దానిని పాటించనంతవరకూ ఏ సమాజమూ బాగుపడదు!
      అసలు సమస్యకు మూలకారణం- మా మహనీయుడే గొప్ప వాడు. మా గ్రంధామే గొప్పది అన్నవాదమే! వాస్తవానికి వాదనను లేవదీసేది ఆ యా మత వర్గాల ‘శాస్త్రులు’ మాత్రమే గాని ‘శాస్త్రాలు’ కాదన్నది అత్యంత గమనార్హం!
      కనుక మలోని ఎవరు ఏ ధర్మ శాస్త్రాలను కలిగి ఉన్నామో వాటిలోని ‘సమాంతర దృక్పథాల’ను వెలికి తీసి, వాటి ప్రాతిపాధికన విభిన్న మత వర్గాల వారిని ఏకతాటిపై తీసుకొని రావటానికి ప్రయత్నిద్దాము. మనం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏ దేవాదిదేవుడు తప్పకుండా సహకరిస్తాడు. ఇది అసాధ్యమంటారా జైగారూ!

    5. Unknown

      అభిలాష్ గారు,

      >>> సృష్టికర్త ఇచ్చిన ధర్మశాస్త్రాల సువిశాల "సిద్దాంతాల" గగనంలో విహరిద్ధాం!

      వాటిని సృష్టికర్త ఇచ్చాడని ఎలా చెప్పగలుతున్నారు? మనుషులే రాసి ఉండొచ్చు కదా? ఇప్పుడు భూమ్మీద పదుల సంఖ్యలో మతాలున్నాయి. కొన్ని లుప్తమయ్యాయి. వాటన్నిటికీ వందల సంఖ్యలో ధర్మ శాస్త్రాలున్నాయి. వాటిలో ఏది దేవుడిచ్చింది? ఏది మనిషి రాసింది?

      వేదాలు మునులు చెప్పగా వినబడినవి, అందుకే వాటిని శ్రుతులు ఆంటారు. కాబట్టి దేవుడిచ్చినవి కాదు.

      ఖురాను మహమ్మదు రాసిన విషయం స్పష్టమే (గాబ్రియేలు చెపితేనే అనుకోండి). కాబట్టి దేవుడు ఇవ్వలేదు. దేవుడు తప్పితే మహమ్మదైన మరొకరైనా మనుషులే కాదా?

      ఇక బైబిలు చారిత్రక గాధల సమాహారం. కాబట్టి దేవుడిచ్చిన గ్రంథం అయ్యే అవకాశం లేదు.

      భగవద్గీత మనిషిగా పుట్టిన కృష్ణుడు చెప్పినది లేదా వ్యాసుడు రాసినది.

      >>> ధర్మ శాస్త్రాల ‘ప్రబోధన’లను మీ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో దానిని మీరు దాచి వేశారట!

      పోనీ దేవుడే ఏదైనా చెప్పదలుచుకున్నా… అది సూటిగా చెప్పకుండా ఇన్ని పుస్తకాలు ఎందుకు అచ్చువేయించాడు? ఇంత కన్‌ఫ్యూజను ఎందుకు కలిగించాడు. ఇన్ని యుద్ధాలకు కారకుడు ఎందుకయ్యాడు?

      అసలు దేవుడు ఏదైనా చెప్పదలుచుకుంటే పుస్తకం అచ్చువేయవలసిన అవసరం ఏమిటి? అది డైరెక్టుగా మనుషుల మనస్సుల్లోనే (వేరే జంతువులు దేవుడికి అనవసరమనుకున్నా) అచ్చువేయొచ్చుగా? అప్పుడు ఈ కొట్లాటలు, వాదోపవాదాలు ఉండవుగా? ఆకలి, దాహం తెలిసినట్టు మనిషికి ధర్మం కూడా తెలిసేదిగా?

    6. Krishna

      తీర్పుదినపు ప్రస్తావన మన హిందూ శాస్త్రాలలో చాలా స్పష్టంగా ఉంది.

    7. Jai Gottimukkala

      "వాటిలో మొదటిది- సిద్ధాంతం సిద్ధాంతమే! దానిని ఇస్లాం సిద్ధాంతం అని, హిందూ సిద్ధాంతం అని, క్రైస్తవ సిద్ధాంతం అని. తోకలు పెట్ట కూడదు"

      ఇదేమి నియమమో ఏమో? ఉ. పెట్టుబడిదారీ వర్గం శ్రామికులని దోచుకుంటుందని చెప్పే సిద్దాంతం కమ్యూనిజం అన్నా అనకపోయినా కాక మానదు.

      "ఇక, నేను వ్యక్తపరుస్తున్న ఈ “సువిశాల భావజాలం” ఖురాన్ మరియు దానికి పూర్వపు గ్రంధాల సందేశం నుండి పరి గ్రహించినదే! "

      ఇస్లాం ప్రకారం గత సందేశాలు వక్రీకరణకు (బిదా) గురి అయ్యాయి. దీన్ని మీరు నమ్మితే ఇతర మత శాస్త్రాలతో మీకు అవసరం లేదు.

      "వాటి ప్రాతిపాధికన విభిన్న మత వర్గాల వారిని ఏకతాటిపై తీసుకొని రావటానికి ప్రయత్నిద్దాము"

      అన్ని మతాలూ ఒక్కటే చెబితే ఇప్పటికే అవి ఒకతాటిపై ఉన్నాయి. మళ్ళీ వాటిని కలిపే ప్రయత్నం అవసరమా?

    8. Unknown

      మిత్రులు జైగారికి వందనములు!
      మీరు పేర్కొన్న ఒక్కొక్క విషయానికి వేరు వేరుగా వివరణ ఇవ్వాలనుకుంటున్నాను.
      <<"వాటిలో మొదటిది- సిద్ధాంతం సిద్ధాంతమే! దానిని ఇస్లాం సిద్ధాంతం అని, హిందూ సిద్ధాంతం అని, క్రైస్తవ సిద్ధాంతం అని. తోకలు పెట్ట కూడదు" ఇదేమి నియమమో ఏమో? ఉ. పెట్టుబడిదారీ వర్గం శ్రామికులని దోచుకుంటుందని చెప్పే సిద్దాంతం కమ్యూనిజం అన్నా అనకపోయినా కాక మానదు.>>
      జైగారూ! వివరణలో నాదే లోపం జరిగింది. క్షమించగలరు.
      నా అధ్యాయమును బట్టి- “స్వచ్ఛమైన దైవధర్మము”నకు చెందిన “మౌలిక ఆలోచన-మౌలిక ఆచరణ విధానము” మన “హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మ శాస్త్రాలైన “గీతా-బైబిలు-ఖురాన్” గ్రంథాలలో చిన్నచిన్న వ్యత్యాసాలతో నేటికీ భద్రముగానే ఉన్నది.
      దాని “వైవిధ్యపు” ఉదాకరణ ఏమిటంటే-
      “విజయా మిల్క్”-“విశాఖా మిల్క్”-“మస్కటీ మిల్క్” లాంటిదే! ఇక్కడ పేర్కొన్న వాటిలో గమనార్హమైనవి ఒకటి- “లేబిల్” మరియు రెండవది- “కంటెంట్” ఆ రెండిటిలో ఏది మారింది? ఏది మారలేదు? ఒకసారి గమనించగలరు.
      1. “విజయా”-“విశాఖా”-“మస్కటీ” అన్న “లేబిల్” మాత్రమే మారింది.
      2. “మిల్క్” అన్న “కంటెంట్” మాత్రం మూడిటిలోని దేనిలోనూ మారలేదు.
      అచ్చం అదేవిధంగా-
      “హిందూ ధర్మం”-“క్రైస్తవ ధర్మం”-“ఇస్లాం ధర్మం” అని ఇక్కడ పేర్కొన్న వాటిలో కూడా గమనార్హమైన వాటిలో ఒకటి- “లేబిల్” మరియు రెండవది- “కంటెంట్” ఆ రెండిటిలో ఏది మారింది? ఏది మారలేదు? అన్నది ఇక్కడా ఒకసారి గమనించగలరు.
      1. “హిందూ”-“క్రైస్తవ”-“ఇస్లాం” అన్న “లేబిల్” మాత్రమే మారింది.
      2. “ధర్మం” అన్న “కంటెంట్” మాత్రం ఈ మూడిటిలోని దేనిలోనూ మారలేదు.
      ఈనాడు సాధారణంగా భావించబడే “వైరుధ్యపు ” ఉదాహరణ ఏమిటంటే-
      “కోల్గేట్ పేస్ట్”-“సన్ ఫ్లవర్ అయిల్”-“అజయ్ బ్రష్” అన్న ఈ మూడింటిలోనూ గమనార్హమైనవి ఒకటి- “లేబిల్” మరియు రెండవది- “కంటెంట్” ఆ రెండిటిలో ఏది మారింది? ఏది మారలేదు? ఒకసారి గమనించగలరు.
      ఇక్కడైతే- “లేబిల్” మరియు “కంటెంట్” రెండూ మారిపోయాయి! “హిందూ ధర్మం”-“క్రైస్తవ ధర్మం”-“ఇస్లాం ధర్మం”లను ఈ విధమైన “వైరుధ్యము”తో నేడు చాలా మంది పొరపాటుగా చూస్తున్నారు. ఈ దృష్టిని తక్షణం మార్చుకో నంతవరకూ మనము మార్గము తప్పి, ఇతరులనూ మార్గం తప్పిస్తూ ఉంటాము.
      “స్వచ్ఛమైన దైవధర్మము”నకు చెందిన “మౌలిక ఆలోచన-మౌలిక ఆచరణ విధానము” మన “హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మ శాస్త్రాలైన “గీతా-బైబిలు-ఖురాన్” గ్రంథాలలో చిన్నచిన్న వ్యత్యాసాలతో నేటికీ భద్రముగానే ఉందన్నది కేవలము నా వాదన కాదు. దానికి బలమైన, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిని కూడా ఈ పత్రికా ముఖముగా ఒక్కొక్కొటిగా ప్రస్తావిస్తాను.
      నా ఈ వాదనకు కేవలం కేవలం- హిందూ-క్రైస్తవ-ముస్లిం ”ధర్మశాస్త్రాలు” మాత్రమే ప్రమాణం. హిందూ-క్రైస్తవ-ముస్లిం సమాజాలకు చెందిన పండితులో లేక వారి సాహిత్యమో కాబోదు అన్నది గమనించగలరు.
      అందుకే నా గత వివరణలో- ఉదాహరణకు: "ఈ మహోన్నత సృష్టికి సర్వోన్నత సృష్టికర్త ఒకే ఒక్కడు ఉన్నాడు, అతడినే వేడుకోవాలి".అన్న "సిద్ధాతము"నే తీసుకోండి. దానిని
      అలాగే- మహనీయుల విషయానికి వస్తే, మొదటి మానవ జంట ఐన ఆదాము-హవ్వలు (హిందూ శాస్త్రాల ప్రకారం- శివ-పార్వతులు) మొదలు శ్రీ రామకృష్ణాదుల నుండి అబ్రాహాము మొదలు ఇస్సాకు, యాజోబు, నుండి మోషే యేసుల తరువాత ప్రవక్త మూకమ్మద్ వరకూ ఉన్న “సకల మహనీయులనూ సమానంగా గౌరవించాలి వారి ఆదర్శాలను అనుసరించాలి" అన్న "సిద్ధాతము"ను ఇస్లాం సిద్ధాంతం అని అందామా? హిందూ సిద్ధాంతం అని అందామా? క్రైస్తవ సిద్ధాంతం అని అందామా? అని ప్రశ్నించి, తోకలు పెట్ట కూడదు అని అన్నాను. అయితే మీరన్నట్లు తోకలు పెట్టాలి. కానీ, అదెలాగంటే-
      హిందూ దేశ “గోవు పాలు”-కనాను దేశ “గోవు పాలు”-అరబ్బు దేశ “గోవు పాలు” అన్నట్లు! ఇక్కడ అత్యంత గమనార్హమైనది- గోవు పాలు, గోవు పాలే అన్నది! అది ఏదేశానికి చెందినదైనా సరే! కాకపోతే- ఆ “గోవు పాలు” ఏ దేశానికి చెందినదనే “విషయ అవగాహన” కొరకు తోకలు పెట్టటంలో మీరన్నట్లు ఎలాంటి దోషమూ లేదు. కాని, ఆ తోకలను బట్టీ- మాదే “గోవు పాలు” మిగిలినవి “కుక్క పాలు” అని ఒకరినొకరు “పరస్పర ఘర్షణ”కు దిగటం అన్నది మటుకు ముమ్మాటికీ మహా దోషమే!

    9. Unknown

      పై వివరణకు ఇది కొనసాగింపు…
      <>
      అన్న మీ విషయాన్ని నేను సమ్మతించను. ఎందుకంటే-
      1. “గత సందేశాలు వక్రీకరణకు గురి అయ్యాయి” అని ఖురాన్ ఎక్కడా పేర్కొన లేదు.
      2. ఖురాన్ కు పూర్వపు గ్రంధాలను విశ్వసించటం అన్నది ఇస్లామీయ మౌలిక విశ్వాసాలలో ఒక విశ్వాసం.
      <<”ఇక, నేనువ్యక్తపరుస్తున్న ఈ “సువిశాల భావజాలం” ఖురాన్ మరియు దానికి పూర్వపు గ్రంధాల సందేశ్యము నుండి పరుగ్రహించినదే! వాటి ప్రాధిపాధికన విభిన్న మతావర్గాల వారిని ఏకతాటిపై తీసుకొని రావటానికి ప్రయత్నిద్దాము”>> అని నేను అన్నందుకు-
      <>
      అని మీరు స్పందించారు.
      అయితే ఇక్కడ మనమందరమూ గమనించ వలసిన విషయము ఏమిటంటే- “గోవు పాలు” వంటి “సచ్ఛమైన దైవ ధర్మము” ఒక్కటే. అందులో రెండు కారణాల వలన వైరుద్ధ్యం ఏర్పడి ఉంది.
      1. అన్వయింపు పరమైనది. దానిని ‘APPLICATIONAL VARIATION’ అంటారు. అది సహజమే. అంటే- “మూల ఉద్దేశము”ను భంగము కలిగించకుండా ఉండే వివిధాలైన ఆచరణా పద్ధతులు.
      2. వ్యక్తిగతమైన లేక వర్గపరమైన స్వార్ధం కొరకు “గోవు పాలు” వంటి “సచ్ఛమైన దైవ ధర్మము”లో హెచ్చుతగ్గులు చేసి, వివిధ వర్గాలను సృష్టించటం. వారి మధ్య వైరిభావనను సృష్టించటం అన్నది మటుకు అత్యంత ఘోరమైన నేరం.
      పైన పేర్కొన్న వాటిలో మొదటి దాని పరముగా “సజ్జను”లైన ఆదిమ హిందూ పండితులు కేవలం “వివరణ” కొరకు మాత్రమే చేసిన “విశ్లేషణ ”ను తరువాతి కాలములో ఆధారముగా చేసుకొని “దుర్జనులై”న కొందరు పండితులు “వర్గాలు” ఏర్పరిచారు. ఇతర ధార్మిక వర్గాలకు చెందిన “దుర్జనులై”న పండితులూ అలాగే చేశారు. అందుకే- హిందూ సమాజములో- శైవము-వైష్ణవములు ఇంకా అనేక ఉప వర్గాలు. క్రైస్తవులలో- క్యాథలిక్కులు-ప్రొటెస్టంటులు ఇంకా అనేక ఉప వర్గాలు. మరియు ముస్లిములలో- సున్నీలు-షియాలు ఇంకా అనేక ఉప వర్గాలు ఏర్పడ్డాయి.
      ఈ నేపథ్యములో వివిధ వైరి వర్గాలుగా విడిపోయిన ఆ యా మత వర్గాల వారికి “గోవు పాలు” వంటి “సచ్ఛమైన దైవ ధర్మము” నకు చెందిన “సార్వకాలిక”మైన మరియు “సార్వజనీన”మైన “మౌలిక దృక్పథము”లు ఏమిటో తేలుసుకొని వాటి ప్రాతిపాధికన ముందు మనము ఏకమై ఇతరులనూ వాటి ఆధారముగా ఏకము చేయాలన్నదే నా తపన అంతా! జైగారూ! విషయము మీకు అర్థమయ్యిందనుకుంటున్నాను. ఇక శెలవు.

  2. Unknown

    హిందూమతం ఈరోజు అనేక మతమార్పిడులకు గురై బ్రష్ఠు పట్టిపోవడానికి ప్రధాన కారణం ఈ విగ్రహారాధనమే! విగ్రహ పూజ మూర్ఖత్వమని, అనేక చెడులకు మూలమని స్వామి దయానందుడు పేర్కొన్నాడు. నిజానికి పండితులు విగ్రహం నిగ్రం కొరకు అన్న స్లో పాయిజిన్ తో సామాన్యులనుండి మేధావుల వరకూ లోబరుచుకుని వారి ద్వారా అనేకమైన ధనమును కూడగట్టుకనుటకు కుట్ర పన్నిరి. ఇవన్నియూ స్వామి దయానందుడు ఎప్పుడో ఎండగట్టినాడు.నిర్వాహకులు కె.యస్.చౌదరిగారు మరిన్ని విషయాలు దయానందుడు విరచించిన సత్యార్ధప్రకాశం నుండి పేర్కొంటే మరింత ప్రయోజనమని మనవి.

    1. Unknown

      శర్మగారికి నమష్కారములతో…సర్ వీలు వెంబడి సత్యార్ధప్రకాశం పుస్తకం నుండి అనేక విషయాలు అందించే ప్రయత్నం చేస్తాను. విగ్రహారాధనను ఖండించే మీ తీరు చాలా నచ్చింది. మీలాంటి విచక్షణ పండితులు ప్రోత్సాహిస్తే స్వచ్చమైన థర్మాన్ని ప్రజల ముందుకు తీసుకురావచ్చు. విగ్రహారాధననే మహమ్మారిని దూరం చేయవచ్చు.మీవంటి ఆర్యసమాజ సభ్యులు ఎంతైనా ముందుకు రావల్సిన అవసరం ఉందని మనవి.

  3. శ్యామలీయం

    K.S. CHOWDARY>స్వర్గమైనా కావచ్చు.నరకమైనా కావచ్చు. ఇవి శాశ్వతలోకాలని వేదాలే ఘోషిస్తున్నాయి.

    Not true.

    1. Unknown

      గౌరవనీయులైన శామలీయం గారికి నమస్కారములు. మీరు సంస్కృత పండితులని, రాయణ విరచితులని చౌదరీగారు చెప్పి ఉన్నారు. మీలాంటి పండిత వర్యుల ద్వారా నేర్చుకోవలసిన అవసరం సమాజానికి ఎంతో ఉంది. ఐతే మీ సముపార్జిత జ్ఞాన "వితరణ"ను మీరు చేస్తేనే కదా అది సాధ్యమయ్యేది!
      ప్రస్తుత అంశము "విగ్రహారాధన శాస్త్ర బద్ధమా? లేక శాస్త్ర విరుద్ధమా?" అన్నది కనుక మీ లాంటి శాస్త్ర కోవిధులు ఆ విషయం పైనే కొంత సమాచారాన్ని శాస్త్రాల ఆధారంగా అందిస్తే మాలాంటివారికి ధన్యత కాగలదని నేను భావిస్తున్నాను.
      ఇక, మరణానంతరం తిరిగి ఈ లోకంలోనే అనేక పర్యాయాలు జన్మించే అవకాశాలు ఉంటయా? లేక దుర్జనులకు "శాస్వత నరకం" సజ్జనులకు "శాస్వత స్వర్గం" ఉంటుందా అన్నది ఒక ప్రత్యేక శీర్షికగా పెట్టి సమాచార మార్పిడి చేసుకుందాము. ప్రస్తుతానికి "విగ్రహారాధన శాస్త్ర బద్ధమా? లేక శాస్త్ర విరుద్ధమా?" అన్న అంశము పైనే మీ నుండి శాస్త్రీయ సమాచారాన్ని అత్యంత ప్రగాఢంగా ఆశిస్తున్నాము. మన్నించగలరు శామలీయం గారూ!

    2. శ్యామలీయం

      శ్రీఅభిలాష్ గారికి నమస్కారం.

      ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం సంస్కృతపండితుడనూ కాను రామాయణం వ్రాసినవాడనూ కాను. ఈ విషయం ఇంతకు ముందే కొద్దిరోజుల క్రిందట ఒక వ్యాఖ్యలో స్పష్టీకరించాను. ఏ బ్లాగులో అన్నది నేను పదిలపరచలేదు కాబట్టి చెప్పలేను.

      పనిలో పనిగా నేనూ ఏ శాస్త్రంలోనూ కోవిదుడనూ కాను. కాని భగవదనుగ్రహం వలన బుధ్ధిపూర్వకంగా శాస్త్రవిరుధ్ధంగా మాట్లాడేవాడిని కూడా కాను.

      కొద్ది సేపటి క్రిందట కార్యాలయం నుండి ఇంటికి వస్తుంటే, విగ్రహారాధనను గురించి మీరు ప్రస్తావిస్తున్న విషయాలు దృగ్గోచరం అయ్యాయి. ఇంకా కొన్ని విషయాలు కూడా దృగ్గోచరం ఐన విషయమూ వాస్తవమే కాని వాటి గురిమ్చి సభాముఖంగా కాని ఇతరత్రా కాని వెల్లడించే అధికారం నాకు లేదు.

      కొన్నికొన్ని విషయలు ప్రస్తావించవలసిందిగా నాకు అందిన ప్రేరణ మేరకు వ్రాయటం జరుగవచ్చును. ఐతే ఇది భగవత్ప్రేరణా లేక నా అహంకారప్రకోపమా అన్నది చదువరులు ఎవరికి వారు వారివారి సంస్కారాలయొక్క ఆధ్యాత్మికపరిణతి యొక్క స్థితిని బట్టి గ్రహించవలసిన సంగతి.

      నాకు కూడా కొంత సమయం కావాలి వ్రాయటానికి. ఐహికమైన జీవితంలో అనుకున్నంతగా అధ్యాత్మికవ్యాసంగాలకు అవకాశం దొరుకదు కదా.

      నాకు వ్రాయాలన్న ప్ర్రేరణ కలగటంతో పాటు మీ అభ్యర్థన కూడా ఉన్నది కాబట్టి తప్పక వ్రాస్తాననే అనుకుంటున్నాను.

      ఒక వ్యాఖ్యగా వ్రాసే విషయం కాదు. గమనించగలరు.

      శాస్త్ర చర్చలపట్ల నాకు అభిలాష లేదు. శాస్త్రవివరణలు చేసే పాండిత్యమూ లేదు. భగవంతుడు ఎలా వ్రాయిస్తే అలా వ్రాస్తాను. కేవలం ఒక ఉపకరణం వంటి వాడిని మాత్రమే.

    3. Unknown

      గౌరవనీయులైన శామలీయం గారికి ధన్యవాదాలు. మా విన్నపాన్ని మన్నించి, "విగ్రహారాధన శాస్త్ర బద్ధమా?-శాస్త్ర విరుద్ధమా?" అనే అంశముపై శాస్త్రీయ సమాచారం అందిస్తానందుకు. వ్యక్తగతంగా నేను కోరుకొనేది ఒకే ఒక్క విషయం. అదేమిటంటే- ఏ దృక్పథం వలన వ్యక్తిలో అనుకూల ప్రవృత్తి జనించగలదో దానిని వెదకి పట్టుకొని, దానిని సర్వసామాన్యం చేయాలన్నదే! నేటి బాధాతప్త ప్రపంచానికి ఆ ఒక్క విషయమే ఉపశమనం కలిగించగదన్నది నా ప్రగాఢ నమ్మకం. వ్యక్తిత్వ నిర్మాణమే జాతి నిర్మాణం. జాతి అంటే వ్యక్తి విరాట్ రూపమే కదా! నేటి అధిక శాతం పడితులు వారు ఏ మత వర్గానికి చెందినవారైనా వారు ధర్మాన్ని-ధర్మ శాస్త్రాలను తమ వ్యక్తిగ లాభార్జన కొరకు తప్ప జాతి విశాల హితం కొరకు ఉపయోగించటం లేదు. కనుక మీలాంటి సజ్జనులైన పండితులు మీ విలువైన సమయంలోని కొంత భాగాన్ని సమాజ ఉద్ధరణ కొరకు కేటాయించాలని నా సవినయ మనవి. ఈ "మహా యజ్ఞం"లో కుల మతాలకు అతీతంగా మన జాతి జనులను కలుపుకుంటూ మనమందరం కలసి కట్టుగా ముందుకు సాగదాం. మన భారత జాతిని "నైతికతకు-ఐక్యత"కు మారు పేరుగా ప్రపంచం ముందు నిలుపుదాం. దానికి కావలసిన శక్తిని-యుక్తిని-విజ్ఞతను ఆ సర్వేశ్వరుడు మనందరికీ దయ చేయునుగాక. తథాస్తు!

    4. Unknown

      శ్యామలీయంగారు! మీరు ఏ ఆధారంతో Not true అంటున్నారో అర్ధం కాలేదు. మీలాంటి పెద్దలు విగ్రహారాధన శాస్త్రబద్ధమా? శాస్త్రవిరుద్ధమా? అనే విషయాన్ని ఉటంకిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.పునర్జన్మల గురించి ఒకసారి దయచేసి ఈ క్రింది లింక్ చూడగలరు.
      https://sakshyammagazine.com/2013/10/blog-post.html

    5. Unknown

      పునర్జన్మలున్నాయా? లేవా? అనే అంశము అప్రస్తుతము. శ్యామలీయంగారిలాంటి రామకీర్తకులు ముందు విగ్రహారాధన శాస్త్రబద్ధమా? విరుద్ధమా? అనే విషయము తెలియపర్చితే ప్రయోజనము అందెవిచ్చినవారగుదురు.అభిలాష్ గారి విన్నపము,చౌదరిగారి విన్నపము గౌరవించదగ్గది, మన్నించదగ్గది.నేను కూడా మీ జ్ఞానసముపార్జితం పంచుకొనుటకు కోసం ఆశిస్తునే యున్నాను.

    6. Jai Gottimukkala

      విగ్రహారాధన శాస్త్రబద్ధమా కాదా అన్నది అసలు ప్రశ్న కానేకాదు. విగ్రహారాదనే మహాపాపమా కాదా అన్న ప్రశ్నకు సమాధానం ముఖ్యం.

    7. Krishna

      విగ్రహారాధన శాస్త్రబద్ధమా కాదా అన్నది అసలు ప్రశ్న కానేకాదు. విగ్రహారాదనే మహాపాపమా కాదా అన్న ప్రశ్నకు సమాధానం ముఖ్యం.

      Exactly.

      Who will determine which sastras are to be considered ? My faith teaches me not to confirm to any book or guru but to seek truth continuously.

    8. Jai Gottimukkala

      Excellent point. Those who are fixated to a particular book are trying to nitpick and highlight points that appear to agree with their own. Even this is partial & uses "left handed logic" by equating "idols are unnecessary" to "idolatry is a mortal sin"!

    9. Unknown

      జై గారికి, కృష్ణ గారికి వందనాలు!
      మీరన్నట్లు మన చర్చ “ధర్మశాస్త్రాలప్రకారం- విగ్రహారాధన మహాపాపమా? కాదా?” అన్న అంశముపైనే జరగాలి.
      తరువాత- “Who will determine which sastras are to be considered?” అన్న కృష్ణగారి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే- హిందువులైతే, హిందూ శాస్త్రాల ప్రకారం, క్రైస్తవులైతే బైబిలు ప్రకారం, ముస్లిములైతే ఖురాన్ ప్రకారం మరియు హేతువాదులైతే ఇంగిత జ్నానము, అనుభవాము-ప్రయోగముల ఫలితములను బట్టి ఏ దేని ఒక సిద్ధాంత సత్యాసత్యాల నిర్ధారణ చేయబడుతుంది. అంటే- “సత్యము” లేక “ధర్మము” అన్నది ఎల్లప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది. ఆ ఒక్క సత్యాన్నే పైన పేర్కొన్న నలుగురూ తమ తమ ప్రమాణాలతో (కొలతలతో) కొలుచుకొని; సంతృప్తి చెంది; స్వీకరిచి; ఆచరిస్తూ ప్రచారం చేసుకుంటారు.
      ఇక్కడ “సత్యం” రెండు విధాలైనదిగా ఉంది. వాటిలో ఒకటి- ఈ సృష్టి ఎందుకు? ఈ సృష్టికి కర్త ఉన్నాడా? మనిషి జన్మ మౌలిక లక్ష్యము ఏమిటి? మరణానంతరం అనేక జన్మలు ఉన్నాయా? లేక ఒకే జన్మ ఉందా? ధర్మబద్ధం అయిన వావివరసలు ఏమిటి? ధర్మబద్ధం కానీ వావివరసలు ఏమిటి? ఏది తినాలి? ఏది తినకూడదు? ఏది త్రాగాలి? ఏది త్రాగకూడదు? ఎలా ప్రవతించాలి? ఎలా ప్రవర్తించ కూడదు? వంటి ఇత్యాది విషయాలు “నిర్దేశిత సత్యం”లోనికి వస్తాయి. ఇది “మానవ జీవన బృహత్ ప్రణాళిక”కు సంబంధించిన సత్యం! ఇది “అధ్యాత్మిక జ్ఞాన శాస్త్రం” ఇది “జడము”గా ఉంటుంది. ఉండాలి కూడా! దీని విషయాములో ప్రతి మనిషీ నేను ఎంతవరకూ బద్ధుడనై ఉన్నాను అనే ఆలోచనను కలిగి ఉండాలి.
      రెండవది- “అన్వేషిత సత్యం”. ఇది “భౌతిక విజ్ఞాన శాస్త్రము”నకు చెందినది. ఇంకా వివరంగా చేప్పాలంటే- విశ్వవ్యవస్థ ద్వారా అపార ప్రయోజనాలను సాధించటానికి విశ్వవ్యవస్థ “నియమాల” (సత్యాల) రహస్యాలను ఛేదించటానికి నిరంతరాయముగా సాగుతూ ఉండే ప్రక్రియ. ఇది ఎందుకు? ఏమిటి? ఎలా? అన్నప్రశ్నలతో నిత్య “చైతన్యము”గా ఉంటుంది. ఉండాలి కూడా!
      నేడు రెండవ సత్యము విషయములో మనిషి అన్వేషణ బాగానే సాగుతుంది. అందుకే- “భౌతిక రంగం”లో నేటి మానవుడు వినీలాకాశము వైపునకు దూసుకొని పోతున్నాడు. ఇక, మొదటి- సత్యం వాస్తవికతను అన్వేషించే విషయములో “శాస్త్రీయము”గా అంటే- ధర్మశాస్త్రాల “ప్రబోధనముల”ను నిర్లక్ష్యం చేసి, కాల్పనిక మూఢాచారాలను మూఢముగా అనుసరిస్తున్నాడు. దాని కారణముగానే- నేటి మానవుడు “నైతిక రంగము”లో అథపాతాళములోనికి దిగజారి పోతున్నాడు. ఈ దురవస్థకు హిందూ-ముస్లిం-క్రైస్తవ తదితర మాత వర్గాలన్నీ గురయి ఉన్నాయి. కనుక ఎవరికి ఏ శాస్త్రంపట్ల నమ్మకం ఉంటే ఆ శాస్త్రముతోనే “నిర్దేశిత సత్యము”ను నిరూపించి, “నైతికము”గా ఉద్ధరించటానికి చేసే ప్రయత్నంలో భాగంగానే మా ఈ ప్రయత్నాలన్నీనూ. కృష్ణగారూ! మీరూ ఈ “మహా యజ్ఞము”లో భాగస్వాములు కావాలన్నది మా ప్రగాఢమైన అభిలాష.

    10. Jai Gottimukkala

      అభిలాష్ గారూ, విగ్రహారాధన మహా పాపమని, దానికి ఇంకే విషయాలు (ఉ. సత్ప్రవర్తన) ఎంచకుండా శాశ్వత నరక ప్రాప్తి ఒక్కటే శిక్ష అని మీరు అంటున్నారు. దీన్ని మీరు చూపించిన దయానందుల వారి బోధనలు సమర్తించవని ఒప్పుకుంటారా?

      పోనీ మీరే మీ గ్రంధం/మతప్రభోదకులు కాక మరే ఇతర శాస్త్రం/పండితుల నుండి ఆధారాలు చూపించండి. అంతేతప్ప ఒకరి మాటలలో కొంతే గ్రహించి సగం సగం ఆధారాలతో చదువరులను ఏమార్చే ప్రయత్నం సరిపోదు.

  4. శ్యామలీయం

    చౌదరిగారూ, శాస్త్ర చర్చలపట్ల నాకు అభిలాష లేదు. శాస్త్రవివరణలు చేసే పాండిత్యమూ లేదు అని ముందే చెప్పాను. వెబ్ చర్చలోకి మళ్ళీ నన్ను లాగాలని యత్నించకండి. ప్రయోజనం ఉండదు. నేను వ్రాయవలసినది ఏమైనా ఉంటే సమయం దొరకినపుడు నా బ్లాగులో వ్రాస్తాను. ఇక్కడ నేను వ్రాసిన మాటలను చర్చగా భావించాలని మీరు అభిప్రాయపడే పక్షంలో ఇక్కడి నా వ్యాఖ్యలను అన్నింటినీ తక్షణం తొలగించండి.

  5. Unknown

    గౌరవనీయులైన శామలీయం గారికి నమస్కారములు!
    "విగ్రహారాధన శాస్త్ర బద్ధమా? శాస్త్ర విరుద్ధమా?" అనే అంశమే కాదు మరే అంశమైనా, వ్యక్తి గతంగా మీరు మీ తరఫునో లేక నేను నా తరఫునో ఇంకా ఎవరో తమ తరఫునో చెప్పేది కాదు కదా! తాము అధ్యాయనం చేసి ఉన్న ధర్మశాస్త్రాల సమాచారాన్ని ఆధార సహితంగా అందించటమే కదా! దానికి వెనుకంజ వేయవలసిన అవసరం ఏముంది? మనకు తేలిసిన సత్యాన్ని బయటపెట్టే అవకాశం ఇచ్చిది సాక్షాత్తు ఆ భగవంతుడే! ఆ అవకాశాన్ని ఆయన నేడు మనకు ఇచ్చాడు. దానిని మనం కాదంటే- రేపు మరొకరి ద్వారా ఆయన బహిర్గతం చేయక మానడు!
    నేడు హిందూ మతం వారు తండోపతండాలుగా వేరే మతాలలోనికి తరలిపోవటానికి ప్రధాన కారణం శాస్త్ర విరుద్ధమైన ఈ విగ్రహారాధనే అన్న సంగతిని ఎందరో స్వచ్ఛమై హిందూ విద్వాంసులు ఆలస్యంగానైనా గుర్తించ గలిగారు! పున్య కాలం కాస్తా గడచి పోకముందే హిందూ పండితులు మేల్కొని, “విగ్రహారాధన రహిత సనాతన వైదిక ధర్మము”ను పునః స్థాపించటాని నడుము బిగించక తప్పదు. ఈ “మహా యజ్నము”ను కనుక చేపట్టకపోతే- అనాదిగా వస్తున్న మహోజ్వాలమైన మహోత్కృష్టమైన “నైతికత”-“మానవత” సౌరభాలను గుబాళించే సనాతన హిందూ సస్కృతి అంతం కాక తప్పదు! అయితే ఆ దుష్పరిణ పర్యవసానపు శాపానికి ఎవరు బాధ్యత వహించవలసి వస్తుందో ఎవరికీ తెలియనిది కాదు.
    కనుక విగ్రహారాధన వలను ఏ పదహారు దోషాలనైతే దయానందుడు నాడు పేర్కొన్నాడో అవి అక్షరాలా నేడు మానమదరం చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ విగ్రహారాధనను ఖండించే స్థితిలో మనం లేకపోవటం కడు శోచనీయం!
    ఒకప్పుడు- ఇందిరా గాంధీ లేని ఇండియాను అసలు ఊహించే పరిస్థితి ఉండేది కాదు. ఆ నేపధ్యంలో ఇందిరా భజన పరులు “ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా” అనటం ప్రారంభించారు. అలాగే నేడు అత్యంత మోసపూరితమైన మరియు అడ్డంగా సంపద దోపిడీకి రాచ మార్గమైన విగ్రహారాధన అనే అధ్యాత్మిక వ్యాపారము చేసుకుంటున్నవారు, ఒకటి వంచకులైన పండిత వర్గం. రెండు- అవినీతిపరులైన రాజకీయ నాయకులు. “విగ్రహారాధనే హిదూధర్మం హిదూధర్మమే విగ్రహారాధన” అనే పరిస్థితిని కల్పించారు. ముస్లిం-క్రైస్తవ సమాజాలదీ అచ్చం ఇదే పరిస్థితి! ఈ ఆ నేపధ్యంలో సకల ధర్మ శాస్త్రాలూ ఏకగ్రీవంగా ముక్తకంఠంతో ఖండిస్తున్న సంగతి స్పష్టంగా తెలిసిన పడితులు సైతం విగ్రహారాధనను ఖండిచటానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇది కడు శోచనీయం!
    అయితే అనతి కాలంలోనే- విగ్రహారాధన లేని హిందూ ధర్మాన్ని, యేసూ-పరిశుద్ధాత్మలను కాక ఒక్క యెహోవాను మాత్రమే ఆరాధించే క్రైతవ్యాన్ని మరియు సమాధుల (దర్గాల) ఆరాధన లేని ఇస్లాంను చూడబోతున్నారు!
    ఇంకా బాధాతప్తులైన మానవుల బాధను తొలగించటమే నిజమైన ఆరాధన, నిజమైన పూజ, నిజమైన ఉపవాసము, నిజమైన యజ్ణము నిజమైన తపస్సు నిజమైన తీర్థము అని ప్రజలు తెలుసుకోనున్నారు! అలాంటి మహత్తర పరివర్తనా “యజ్ణము”లో మీరూ మేమూ భాగస్తులు కావటం మన అదృష్టమే కాగలదని నేను భావిస్తున్నాను. మరి మీరేమంటారు శామలీయం గారూ!?

    1. శ్యామలీయం

      మీరు మీకు తోచిన నిర్ణయాలకు వచ్చేసారు. ఇక చర్చ దేనికి? మీ అభిప్రాయాలతో అనేక విషయాలలో నేను ఏకీభవించలేను. మన మధ్యన భావసారూప్యత నాకు కనిపించటంలేదు కాబట్టి మనం భాగస్వామ్యంతో పనిచేయటం సంభవం కాదు. మీ నిర్ణయాల సామంజస్యాన్ని ప్రశ్నిస్తూ ఆ విషయమై మీ సమయమూ నా సమయమూ కూడా వృధాచేయటం నాకు సమ్మతం కాదు. పైగా నేను ఉధ్యోగబాధ్యతలు కల జీవిని. మీ కోసం సమయం కేటాయించటం నాకు వీలు పడదు. ఏ విధమైన వెబ్-చర్చలలోనూ నేను చురుగ్గా పాల్గొనటం లేదని స్పష్టీకరించాక కూడా మీరు ఇలా ఒత్తిడి తీసుకొనిరావటానికి ప్రయత్నించటం ఆశ్చర్యంగా ఉంది.

    2. Unknown

      గౌరవనీయులైన శామలీయం గారికి నమస్కారాలు!
      మాకు తెలిసిన, మాకు తోచిన విషయాలను మేము నిస్కర్షగా, నిర్మొహమాటంగా ప్రస్తావిస్తున్నాము. అయితే అవే సత్యాలు, వాటిపై ఇక చర్చకు తావే లేదు అని మేము అంటే- మీరు ఆ నిర్ణయానికి రావటం సమంజసమే! మా వాదనతో ఏకీభవించమని మిమ్మలిని మేము కోరలేదు. మా శాస్త్ర అధ్యాయనం మేరకు మాకు తెలిసిన విషయాన్ని మేము ప్రకటించాము. ఒకవేళ “విగ్రహారాధన” శాస్త్ర బద్ధమే అయితే దానికి గల శాస్త్రీయ ఆధారాలను తెలపమని మాత్రమే మిమ్ములను సవినయముగా కోరుతున్నాము.
      “విగ్రహారాధన”ను ఖండించిన- రాజారామ్మోహన రాయ్ గాని, స్వామీ దయానంద సరస్వతి గాని, సంఘ సంస్కర్త వీరేశ లింగం పంతులు గాని వైదిక పరిజ్ఞానంలో గొప్ప గొప్ప ఉద్దండ పండితులే కదా! వారు ఏ క్రైస్తవులో, ముస్లిములో కాదు. లేక కనీసం వారి ప్రభావానికి గురైనవారూ కాదు.
      పైగా ఈ “విగ్రహారాధన” అనే సమస్య ఒక్క హిందువులకు మాత్రమే చెందిన సమస్య మాత్రమే కాదు. అది క్రైస్తవ-ముస్లిం తదితర మతావర్గాలకూ సబంధించిన సమస్య!
      అంతే కాదు కోటానుకోట్ల బీదసాదల బ్రతుకులు బాగూపడటాని సంబంధించిన సమస్య.
      ఇంకా, భక్తి పేరిట వృద్దులు, స్త్రీలూ, పిల్లలూ రోజులూ వారాలూ నెలల తరబడి పాద యాత్రలు చేసే వారి సమస్య.
      మ్రొక్కుబడుల పేరిట వృద్దులు, స్త్రీలూ, పిల్లలూ రోజులూ వారాలూ తరబడి గుడీ-గోపురాల వద్ద, చర్చీలూ-దర్గాల వద్ద పడిగాపులు కాస్తూ, నిలుదోపిడీలు చేసుకుంటూ సర్వ విధాలా సర్వనాశనం అవుతున్నవారి సమస్య.
      ఆర్ధికంగా చూస్తే- లక్షల కోట్ల రూపాయల వెండి-బంగారాలు గుడీ-గోపురాలలో, చర్చీలూ-దర్గాలలో బ్లాక్ అయిపోయి, మరుగున పడిపోయే సమస్య.
      ఇలాంటి ఇంకా ఎన్నెన్నో జఠిల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించటంతో “మన చర్చ” ముడిపడి ఉంది. ధర్మశాస్త్రాల గొప్ప జ్ఞానం ఉన్న మీ లాంటి వారికి, కొద్దిపాటి జ్ఞానం ఉన్న మాలాంటి వారికి ధర్మం పేరిట జరుగుతున్న ఈ ప్రహసనాన్ని చూస్తూ ఊరుకొనే అవకాశమో లేక తప్పించుకొనే అవకాశమో ఉందంటారా శ్యామలీయం గారూ!
      “మన మధ్యన భావసారూప్యత నాకు కనిపించటంలేదు కాబట్టి మనం భాగస్వామ్యంతో పనిచేయటం సంభవం కాదు” అని మీరు తీర్మానించటం భావ్యం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే- పరస్పర అభిప్రాయ మార్పిడితోనే కదా భావసారూప్యత ఏర్పడేది. ఆ తరువాతే కదా భాగస్వామ్యం కుదిరేది.
      పైగా అటు మీరు మాటలాడినా ఇటు మేము మాటలాడినా మన ఇరువురికీ మధ్య ప్రమాణం ఒక్క హిందూ శాస్త్రమే కదా! అటువంటప్పుడు ఇందులో ఎవరో నిష్ఠోరము పడటానికి ఏముంటుంది? మీ ప్రతిపాదిత విషయాన్ని ఎవరైనా సమర్ధిస్తే అది మిమ్మలిని కాదు, తమ ధర్మ శాస్త్రాన్నే సమర్ధించుకున్నట్లు అవుతుంది! అలాగే మీ ప్రతిపాదిత విషయాన్ని ఎవరైనా విమర్శిస్తే అది మిమ్మలిని కాదు, తమ ధర్మ శాస్త్రాన్నే విమర్శించుకున్నట్లు అవుతుంది! అటువంటప్పుడు తమరు ఈ చర్చలో పాల్గొననటం నాకు ఇబ్బందిగా ఉంది అనటం భావ్యమా అన్నది మా ప్రశ్న. అలాగని మిమ్మలిని ఇబ్బందిపెట్టటం మాకూ సమంజసం కాదనుకోండి…
      కాకపోతే- విగ్రహారాధన సశాస్త్రీయమే అయితే, శ్యామలీయం గారంతటి పండితులు దానికి హిందూశాస్త్రాల నుండి ఆధారాలను చూపటానికి ఎందుకు వెనకడుగు వేసారూ? అన్న ప్రశ్న విగ్రహారాధకులైన వారికి ఒక శేష ప్రశ్నగానే మిగిలిపోతుందన్నది మటుకు వాస్తవం!

  6. శ్యామలీయం

    >ధర్మశాస్త్రాల గొప్ప జ్ఞానం ఉన్న మీ లాంటి వారికి.....
    కాదని చాలామార్లే చెప్పానే?

    >తమరు ఈ చర్చలో పాల్గొననటం నాకు ఇబ్బందిగా ఉంది అనటం భావ్యమా అన్నది మా ప్రశ్న.
    నాకు ఇబ్బందిగా ఉండటాన్ని ప్రశ్నించే హక్కు ఉందా మీకు?

    >విగ్రహారాధన సశాస్త్రీయమే అయితే, శ్యామలీయం గారంతటి పండితులు దానికి హిందూశాస్త్రాల నుండి ఆధారాలను చూపటానికి ఎందుకు వెనకడుగు వేసారూ? అన్న ప్రశ్న ..

    నేను పండితుడను కానని ఎన్ని సార్లు చెప్పాలో!
    నేను వెనుకడుగు వేస్తున్నానా? నాకు వీలైనప్పుడు నా బ్లాగులో ప్రస్తావిస్తానన్నాను కానీ? అంటే మీ బ్లాగులో నా ఉద్యోగబాధ్యతలు వదలుకొని మీతో చర్చలు చేస్తూ కూర్చోవాలా? అది సమంజసంగా ఉంటుందా?

    దయచేసి నన్ను ఉద్దేశించి మరలా వ్యాఖ్య వేయకండి. నాకు జవాబు చెప్పటం కుదరదు.

    దయచేసి చదువరులు గమనించండి. ఈ బ్లాగులో నన్ను చర్చలోకి ఈడ్చే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తున్నాను. ఇకముందు వీరు రెచ్చగొట్టినా వ్రాయటం జరుగదు. ఈ రకమైన ధోరణులు నాకు ఎంతమాత్రం నచ్చవు.

  7. Jai Gottimukkala

    @M.A. ABHILASH:

    "“గత సందేశాలు వక్రీకరణకు గురి అయ్యాయి” అని ఖురాన్ ఎక్కడా పేర్కొన లేదు"

    ఈ క్రింది వాటిని పరిశీలించండి.

    2:75

    Do you covet the hope, O believers, that they would believe for you while a party of them used to hear the words of Allah and then distort the Torah after they had understood it while they were knowing?

    4:47

    O ye People of the Book! believe in what We have now revealed, confirming what was already with you, before We change the face and fame of some of you beyond all recognition, and turn them hindwards, or curse them as We cursed the Sabbath-breakers, for the decision of Allah Must be carried out

    5:15

    O People of the Scripture, there has come to you Our Messenger making clear to you much of what you used to conceal of the Scripture and overlooking much. There has come to you from Allah a light and a clear Book

    సహీ బుఖారీ 92:461

    Ibn 'Abbas said, "Why do you ask the people of the scripture about anything while your Book (Quran) which has been revealed to Allah's Apostle is newer and the latest? You read it pure, undistorted and unchanged, and Allah has told you that the people of the scripture (Jews and Christians) changed their scripture and distorted it, and wrote the scripture with their own hands and said, 'It is from Allah,' to sell it for a little gain. Does not the knowledge which has come to you prevent you from asking them about anything? No, by Allah, we have never seen any man from them asking you regarding what has been revealed to you!"

    అంతెందుకు మీరే "చిన్న చిన్న వ్యత్యాసాలు" అన్నారు.

    సదరు వ్యత్యాసాలకు మీరిచ్చిన పాల పాకెట్ ఉదాహరణ గురించి చూద్దాం.

    కురాన్ బైబిల్ (ఇంజీల్) గ్రందాల మధ్య వ్యత్యాసాలు ఉంటె దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? దేవుడు తన మాట (కొద్దిగే అనుకున్నా) మార్చాడా లేదా దాన్ని రాసుకున్నవారు మార్చారా? రాసిన వారు తప్పుగా అది వక్రీకరణ కాదా?

    ఒకవేళ పాకెట్ మాత్రమె తేడా కంటెంట్ ఒకటే అయితే మీ లాంటి వారు మతం మారడం ఎందుకు?

    "నా అధ్యాయమును బట్టి- “స్వచ్ఛమైన దైవధర్మము”నకు చెందిన “మౌలిక ఆలోచన-మౌలిక ఆచరణ విధానము” మన “హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మ శాస్త్రాలైన “గీతా-బైబిలు-ఖురాన్” గ్రంథాలలో చిన్నచిన్న వ్యత్యాసాలతో నేటికీ భద్రముగానే ఉన్నది."

    మీరు ఇతర మతాల మీద అవగాహన మార్చుకోవాలి. బైబిల్ రచనా శైలిలో పొదుపు/పిట్ట కథల ప్రయోగం జాస్తి. మీరు వాడుతున్న literal interpretation పద్దతి దీనికి సరిపోదు.

    ఇక హిందూ "మతం" విషయానికి వస్తే, ఇది ఒక జీవనసరళి. దీన్ని ఒకటో రెండో గ్రందాల ఉక్కుపట్టులో బిగించడం తప్పు. ఒకవేళ గ్రంధాలను ఆధారంగా తీసుకున్నా వేదాలు & ఉపనిషత్తులు గీత కంటే పురాతనము అన్న విషయం మీరు మరచినట్టున్నారు.

  8. hari.S.babu

    శిలువను పూజించు క్రైస్తవులు విగ్రహారాధకులు కారా,అదేమి చిత్రము?
    అది రూపమే కదా!దానిని భూతములను వదలించెది మహత్తులున్నవే!

    మక్క నగరములోని కాబ ఘనమెట్లు కాదో చెప్పవోయి పిచ్చివాడ?
    ఘనము రూపము కాదనుట వితండ వాదము కాదటోయ్ వెర్రివాడ!

    మేము చేయునది గొప్ప వారు చేయునది తప్పు
    అని చెప్పుట మితిలేని మూఢత్వమునకె సాక్ష్యము!

  9. Ranjith Vadiyala

    అభిలాష్ గారు - మీకు స్వామీ దయానంద సరస్వతిపై ఇంత నమ్మకం ఉన్నందుకు చాల సంతోషం. విగ్రహారాధనతో, మోక్షం రాదనీ చెప్పిన ఆయనే, సత్కర్మ ద్వారా మోక్షం లభిస్తుందండి, పునర్జన్మ ఉండదని చెప్పారు. అంటే ఆయన దృష్టిలో మరల జన్మించకపోవడం అనేది మోక్షానికి చాల ముఖ్యం. నేను విన్నంత వరకూ క్రీస్టియన్లు, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు. కాని మీరు చూస్తే దాన్ని నమ్మిన దయానంద సరస్వతి గారి వాదనని సమర్దిస్తున్నారు. ఈ విషయం కొంచెం వివరించగలరా?

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine