• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » వ్యక్తిత్వ వికాసం » ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే "మర్యాద"

ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే "మర్యాద"

Label: వ్యక్తిత్వ వికాసం

ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే మర్యాద అనేది మనకందరికి బాగా తెలిసినదే.ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం మర్యాద అంటే ఇతరులతో గౌరవంగా మాట్లాడటం, వారిని చక్కగా సంభోధించడం వారి శక్తిశామర్ధ్యాలను గుర్తించి ప్రశంచించడం, ఎదుటి వారి పట్ల హీనంగా, అవమానించేలా మన ప్రవర్తన లేకపోవడం మొదలగునవి.
            ప్రతి వ్యక్తి ఓ ప్రత్యేకతను కలిగి ఉంటాడు. అంతేకాక అతనిలో ఓ విధమైన శక్తి దాగి ఉంటుంది. సాధారణంగా జనులు బాహ్యంగా కనిపించే ఆడంబరాలు, డబ్బు, అధికారం మొదలగు వాటిని బట్టి ఆయా వ్యక్తులను గౌరవించడం మనం చూస్తూ ఉంటాం. ఇవి అశాశ్వతమైనవి. ఇవి చేతులు మారుతూ ఉండవచ్చు. ఇలాంటి వారికీచ్చే గౌరవం వారి ముందు మాత్రమే, వారి వెనుక రకరకాలైన కామెంట్స్ చేయడం మనకు తెలిసిన విషయమే.

            నిజానికి మనిషి ఉన్నత వ్యక్తిత్వం, తెలివి తేటలు, శక్తి సామర్ధ్యాలు, తోటివారిపై వారు చూపే జాలి,ప్రేమ,దయ,కరుణ,ఆప్యాయత,అనురాగాలు, ఒక మాటలో చెప్పాలంటే మానవీయ విలువలు, వారికి ఉన్న పరిజ్నానమ్ ఇలా ఏదో ఒకటి చూసి మనం వారి పట్ల గౌరవభావాన్ని పెంచుకుంటాం. మనల్ని ఎవరైనా గౌరవిస్తేయ మనం కూడా వారిని గౌరవిస్తాం. ఒకరిపట్ల మరొకరికి అభిమానం ఉన్నంతకాలం ఒకరికొకరు గౌరవించుకోవడం మనం చూస్తుంటాము.
            గమ్మత్తైన విషయమేమిటంటే కొందరు ఇతరులను అయితే గౌరవిస్తారు కానీ తమను తాము గౌరవించుకోరు. ప్రతి మనిషికి తనపట్ల తనకు గౌరవం ఉండాలి. దానినే ఆత్మగౌరవం అంటారు. ఆత్మగౌరవం లోపించినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో విజయావకాశాలు ఘోరంగా దెబ్బతింటాయి.
            మన శక్తి సామర్ధ్యాల పట్ల మనకు నమ్మకం ఉండాలి. కానీ అతి నమ్మకం పనికిరాదు.ఏ వృత్తిలోని వారైనా, ముఖ్యంగా రచనా, జర్నలిజాన్ని వృత్తిగా లేదా ప్రవృత్తిగా కలిగినవాళ్లు తమకున్న జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, తమ మెదళ్లను విజ్ఞాన ఖనిగా చేసుకునేందుకు నిరంతర పఠనం, అధ్యయనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం మన మేధస్సును గౌరవించినవారమవుతాము. మన అన్ని అవయవాల పట్ల అభిమానం, సర్వేంద్రియాల పట్ల శ్రద్ధ ఉంటే ఆత్మను గౌరవించినట్లే. లేదంటే సర్వేశ్వరుడైన అల్లాహ్ మనకు ప్రసాదించిన అనేక వరాలను తృణీకరించినవారమవుతాం. ప్రతి దాన్ని గౌరవించడం, ప్రేమించడం అలవర్చుకోవాలి. పెద్దలను గౌరవించాలి. పిల్లలను ప్రేమించాలి అని ప్రవక్త(స) వారి ప్రవచన సారాంశం మనందరికి తెలిసిందే. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవటంతో మర్యాదను ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రారంభిద్దాం. శుభమ్!!

2 Responses to "ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే "మర్యాద""

  1. Aravind

    Well said…
    మర్యాద గురించి చాలా చక్కగా వివరించారు. బాగుంది.

  2. Unknown

    chala bagundhi

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine