• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » వీళ్ళను ఏమనాలి? నిజంగా గొర్రెలేనా?

వీళ్ళను ఏమనాలి? నిజంగా గొర్రెలేనా?

క్రైస్తవులను చూస్తుంటే మనకి గొర్రెలను చూసినట్టే అనిపిస్తుంది. అయ్యగార్లు, అమ్మగార్లు అని పిలిపించుకునే ఈ పాస్టర్లకు ఏది తోస్తే అదే వేదంగా చర్చి సభ్యుల చేత నమ్మిస్తూ ఉంటారు. ఎంత మాయ స్వయంగా యేసే వీరి కలల్లోకి వచ్చి తమ సభ్యుల బాగోగులు మరీ అడిగి వెళ్తుంటారు. విచిత్రం ఏమిటంటే ఆయన (యేసు) గారు మాత్రం పాస్టర్ల దగ్గరకు వెళ్తారు గాని తమ భక్తుల కలలలోకి మాత్రం రారు.
        నాకు ఈ క్రైస్తవుల నమ్మకాలు, మాటలు, పనులు కడు విచిత్రంగా ఉంటాయి. వీరి దృష్టికి హిందువులు ఆన్యులంట! ఇంకా అవిశ్వాసులునూ, విగ్రహారాధికులునూ. వీరి పెట్టినది తినే విషయంలో గాని, వీరి నమ్మకాలుగానీ ఏమాత్రం పట్టించుకోకూడదు. ఎందుకంటే వీరు (హిందువులు) ఆన్యులునూ, ఏమీ తెలియని అమాయకులునూ.

         మరి వీరు చేసేది ఏమిటో వీళ్లకే తెలియదు. కానీ క్రైస్తవులవడమంటే స్వర్గవాసులమన్నట్టు ఫీలయిపోతారు. నిజం చెప్పాలంటే వీరికి గాని, ఈ చర్చి పాస్టర్లకు గాని అసలు బైబిలంటే ఏమిటో తెలియదు.
         వీళ్ళకు యేసు దేవుడు? గాని బైబిల్లో యేసుకు, భూలోక వాసులందరికీ యెహోవా దేవుడు.
         వీళ్ళు మన పాపం కోసం యేసు శిలువ పై చనిపోయేడని నమ్ముతారు. నమ్మబలికిస్తారు. కాని బైబిల్లో యేసు శిలువపై చనిపోలేదని దేవుడే ఆయనను కాపాడుకున్నాడని ఉంది. వీళ్లదంతా మాయ బోధ. పాపం అమాయక క్రైస్తవులు వీరికి బలవుతూనే ఉన్నారు.
         తండ్రి దేవుడు,యేసు దేవుడు,పరిశుద్ధాత్మ దేవుడని,ముగ్గురూ కలిపి దేవుడని, త్రిత్వమని ఇలా పిచ్చి,పిచ్చి బోధనలు చేస్తూ ఉంటారు. ఇవ్వన్నీ బైబిల్లో ఎక్కడా కానరావు. భూతద్ధం వెతికి చూసినా కనిపించవు. అంతా మాయ బోధ. ఒకప్పుడు బ్రతకలేనోడు బడి పంతులనేవారు. ఇప్పుడు బ్రతకలేనోడల్లా నాలుగు బైబిల్ వాక్యాలు పట్టుకుని పాస్టర్లు అయ్యిపోతున్నారు. యేసు వారు " వీరూ పరలోకం వెళ్లరు. వెళ్ళేవారిని వెళ్లనివ్వరు" అని వీరి గురించే చెప్పారు. అప్పుడు శాస్త్రులకు, ఇప్పుడు పాస్టర్లకు అంతే తేడా!
         మరొక విచిత్రం ఏమిటంటే వారం,వారం సంస్కారాలు, కష్టపడి తెచ్చుకున్న దాంట్లో పదియవ వంతు దోచుకుంటారు. బియ్యంలోనూ, తొలి కోడిపెట్ట, తొలి కోడిగుడ్డులోనూ వీరికి వాటాలే. మాయ చేయడానికి వారికి సిగ్గు లేకపోతే, ఈ చర్చి సభ్యులకు సిగ్గు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు, మోసాలు ఉన్నాయి. ఈ పాస్టర్ల ఆగడాలు ఇంతా,అంతా కాదు. వీళ్ళను గ్రుడ్డిగా ఫాలో అవుతున్న ఈ అమాయక క్రైస్తవులను నిజంగానే గొర్రెలనాలి.

2 Responses to "వీళ్ళను ఏమనాలి? నిజంగా గొర్రెలేనా?"

  1. విసుకి వాడి మనస్సె ఒక విశ్వం…

    ఇప్పుడు బ్రతకలేనోడల్లా నాలుగు బైబిల్ వాక్యాలు పట్టుకుని పాస్టర్లు అయ్యిపోతున్నారు..
    ఈ lines super అండి..
    మా school-mate (strictly school-mate, ఎందుకంటే వాడు 10th fail) కూడా ఇప్పుడు పెద్ద ఫాస్టరు.

  2. Aravind

    మీరు చాలా బాగా చెప్పారు చౌదరిగారు! నూటికి నూరు పాళ్ళు పచ్చినిజం!!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine